మోటకొండూరు ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్

Spread the love

మోటకొండూరు ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

NTODAY NEWS: మోటకొండూరు

ప్రజలకు ప్రభుత్వానికి వారది పత్రికలేనని, నిజాయితీగా నిర్భయంతో విలేకరులు పనిచేసి సమాజంలోని కుల్లు కుతంత్రాలను వెలికి తీయాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఆయన శుక్రవారం రోజున మోటకొండూరు మండల కేంద్రంలో నూతన మోటకొండూర్ ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విలేకరుల సంక్షేమం కోసం పాటు పడుతుందని అన్నారు. మారుమూల గ్రామాల నుండి మండల కేంద్రం వరకు జర్నలిస్టులు ప్రజా సమస్యలను వెలికి తీసి పరిష్కరించడంలో పార్టీలకతీతంగా కృషి చేయాలని అన్నారు. మోటకొండూర్ లో విలేకరులకు కేటాయించిన ప్లాట్ల సమస్య త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మోటకొండూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చామల మహేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు షేక్ ఉస్మాన్, ప్రదాన కార్యదర్శి గుర్రాల నాగరాజు,జాయింట్ సెక్రటరి సూదగాని నవీన్ గౌడ్, సహయ కార్యదర్శులు కోల పరుషరాములు, పుల్లె నరేష్ యాదవ్, కోషాదికారి కంది చంద్రకళ వెంకట్ రాంరెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ గట్టికొప్పుల శ్రీనివాస్, వివిద శాఖల అధికారులు,వివిద పార్టీల నాయకులు,యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top

Poster సిద్ధంగా ఉంది


Translate »