జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన అధ్యాపకులకు సన్మానం

Spread the love

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన అధ్యాపకులకు సన్మానం

NTODAY NEWS: బొమ్మలరామారం

యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం ప్యారారం గ్రామంలో శుక్రవారం రోజున ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్యారారంలో డా. సర్వేపల్లి రాధా కృష్ణన్( సెప్టెంబర్ 5) జన్మదినాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్యారారం మరియు గద్దరాల్ల తండా పాఠశాలలలోని ఉపాధ్యాయులకు మరియు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా జిల్లా నుండి ఎంపికైన నిర్మలా జ్యోతి, శ్రీదేవిలకు ఘనంగా గ్రామ పెద్దల సమక్షంలో, మాజీ ఎంపీపీ చిమ్ముల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో సన్మానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మాట్లాడుతూ విద్యార్థుల జీవితాన్ని మలిచేది గురువులే అని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాధికారి రోజా రాణి, మాజీ సర్పంచ్ చిమ్ముల రవీందర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మల్లేష్, ప్రధానోపాధ్యాయులు హైమావతి,విజయ్ కుమార్ రెడ్డి, వర్లు,గిరిధర్ రెడ్డి,గ్రామస్తులు సురేష్ రెడ్డి,బిక్షపతి గౌడ్,వెంకట్ రెడ్డి,నగేష్,లక్ష్మణ్,మల్లేష్, సన్నీ రెడ్డి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top

Poster సిద్ధంగా ఉంది


Translate »