చిట్యాల లో భారీగా గంజాయి పట్టివేత

Spread the love

చిట్యాలలో భారీగా గంజాయి పట్టివేత

NTODAY NEWS: రిపోర్టర్ కూనురు మధు

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో భారీగా గంజాయిని చిట్యాల పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి తరలిస్తున్న ఈ అంతరాష్ట్ర ముఠాను స్కెచ్ వేసి చిట్యాల సీఐ నాగరాజు, ఎస్సై రవికుమార్ తమ పోలీసు సిబ్బందితో పట్టుకున్నారు. వీరి వద్ద నుండి
రెండు కార్లు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ కు తరలించారు. చిట్యాల పోలీస్ స్టేషన్లో గురువారం సాయంత్రం డీఎస్పీ శివరాం రెడ్డి విలేకరుల సమావేశంలో మాటాడుతూ పట్టుబడ్డ వ్యక్తి నుండి 250 కిలోల గంజాయి, రెండు కార్లు, 6 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని . వీటి విలువ రూ.1 కోటి రూపాయలు ఉంటుందని అన్నారు. చిట్యాల టౌన్‌లో పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుడు నూర్ మొహమ్మద్, పట్టు పడగా పరారీలో ఉన్న ఆరుగురు నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టామని అన్నారు. పరారీలో ఉన్న నిందితులు, అందరూ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రాంతాలకు చెందినవారే అని, రాహుల్ మిశ్రా అనే ఢిల్లీకి చెందిన వ్యక్తి వీరిని 20వేల రూపాయలు చెల్లించి గంజాయిని అక్రమతంగా వివిధ ప్రాంతాలకు తరలించడానికి నియమించుకున్నాడని ఈ ముఠాకు నేతృత్వం వహించిన మొనిస్ అలియాస్ రాహుల్ మిశ్ర ఢిల్లీలో గంజాయి అమ్మకం చేస్తున్నట్లు పట్టుబడ్డ నూర్ మహమ్మద్ అలియాస్ రాజా అనే నిందితుడు ఒప్పుకున్నాడని తెలియజేశారు వీరి పైన మారకద్రవ్య నిరోధక చట్ట 1985, సెక్షన్ 8 (C), 20(b)(ii)(C), 29 కింద కేసు నమోదు, నిందితుడిని రిమాండ్‌కు తరలిస్తున్నట్టు వెల్లడించిన డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. వీరిని చాకచక్యంగా పట్టుకున్నటువంటి చిట్యాల పోలీస్ కానిస్టేబుల్ అయిన హెడ్ కానిస్టేబుల్ మల్లేష్, మహసిన్ పాషా, కానిస్టేబుల్ వెంకన్న, రాజేష్ మహేష్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Translate »