5000కు పైగా ఉద్యోగ అవకాశాలతో భారీ జాబ్ మేళా
ఏప్రిల్ 13, ఆదివారం —NTODAY NEWS బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ
బీబీనగర్: యువతకు విజయవంతమైన కెరీర్ అవకాశాలు అందించేందుకు ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం నాడు బీబీనగర్లో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాను బీజేపీ యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ అంబటి తరుణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
ఈ జాబ్ మేళాలో 50కిపైగా ప్రముఖ కంపెనీలు పాల్గొనబోతుండగా, 5000కి పైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ప్రత్యేకంగా, ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులకు స్పాట్ ఆఫర్ లెటర్లు అదే రోజు అందజేయబడతాయి.
ఉపలభ్య విభాగాలు:
ఐటీ, ఐటీఈఎస్
కోర్ రంగాలు
ఫార్మా
బ్యాంకింగ్
హాస్పిటాలిటీ
నర్సింగ్
రిటైల్
ఎఫ్ఎంసీజీ
మేనేజ్మెంట్
నైపుణ్యంతో కూడిన మరియు నైపుణ్యం లేని ఉద్యోగాలు
ఈ రోజు జరిగిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అంబటి తరుణ్ రెడ్డి గారితో పాటు జిల్లా బీజేవైఎం నాయకులు పొట్ట నవీన్ కుమార్ దేవరుప్పల శ్రీధర్, బీబీనగర్ మండల ప్రధాన కార్యదర్శి కడెం పండు, మాజీ వార్డ్ సభ్యుడు బరిగాల రవి, ST మోర్చా నాయకులు బిచ్చా, బాలు, గ్రామ అధ్యక్షులు విజయ్, శ్రీను, వెంకట్, మండల నాయకులు నర్సింహ గణేష్, నరేష్, శ్రావణ్.