నకిరేకల్ నియోజకవర్గాన్ని అనీ విధాలుగా అభివృధి చేస్తా

Spread the love

నకిరేకల్ నియోజకవర్గాన్ని అనీ విధాలుగా అభివృధి చేస్తా—– నకిరేకల్ వేముల వీరేశం

(NTODAY NEWS) మే 6

నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో నకిరేకల్, కేతేపల్లి, కట్టంగూర్, నార్కెట్‌పల్లి, చిట్యాల మండలాలకు సంబంధించిన 300 లభ్దిదారులకు కల్యాణ లక్ష్మీ మరియు షాది ముబారక్ కింద మంజూరైన చెక్కులను మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 543 చెక్కులను మంగళవారం రోజున నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ నేడు కల్యాణ లక్ష్మీ చెక్కులను ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందుకుటున్న ప్రతి ఒక్క లభ్దిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో కల్యాణ లక్ష్మీ పెట్టుకోవాలంటే నాయకుల చుట్టూ తిరగాల్సి ఉండేదని నేటి ప్రజా పాలన లో ఆ అవసరం లేదని నేరుగా తహసీల్దార్ ఆఫీస్ లో దరఖాస్తు పెట్టుకుంటే సరిపోతుందని ప్రజలకు మనం సేవకుడిగా ఉండాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారని నిత్యం నేను అందుబాటులో ఉంటు న్యాయం పక్షానే నిలబడతానని అన్నారు అంతే కాకుండా ఇందిరమ్మ ఇండ్లు మన నియెజకవర్గంకీ 3500 మంజూరు అయ్యాయని, అర్హత కలిగిన వారికే ఇండ్లు మంజూరు చేస్తామని నకిరేకల్ నియెజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని నకిరేకల్ లో 100 పడకల ఆసుపత్రిని నిర్మాణ పనులను త్వరలో పూర్తి చేసుకొని మెరుగైన వైద్యం ప్రజలకు అందుబాటులోకి ఇస్తామని తెలంగాణ రాష్టంలో ఇప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితి రేవంత్ రెడ్డి తప్ప ఎవరూ ఈ రాష్టంని నడపలేరు గత పాలకులు గడిచిన 10 సంవత్సరాల్లో 8 లక్షల కోట్ల అప్పులు చేశారు అవన్నీ సరిదిద్దు కుంటూ ముఖ్యమంత్రి ముందుకు వెళుతూ ప్రజాపాలన సాగిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిసి ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య, నకిరేకల్ మార్కెట్ చైర్మన్ గుత్తా మంజుల-మాధవ్ రెడ్డి, చిట్యాల మార్కెట్ చైర్మన్ నర్రా వినోద – మోహన్ రెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత – శ్రీనివాస్, ఆయా మండలాల తహసీల్దార్ లు, మండలాల అధ్యక్షులు, స్థానిక కౌన్సిలర్లు, ఆయా గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top