పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలి

Spread the love

పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని కోరుతూ విద్యుత్ నిలయం సిఎండి కార్యాలయంలో అధికారులకు మెమరండం అందజేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు

కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ గారు, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ గారు, వైసిపి సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు గారు,కార్పొరేటర్లు,డివిజన్ ఇన్చార్జిలు,జిల్లా అనుబంధ బాగా అధ్యక్షులు పార్టీ హోదాలో వివిధ ఉన్న నాయకులు,కార్యకర్తలు..

దేవినేని అవినాష్ గారి కామెంట్స్

జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో పెంచిన కరెంట్ ఛార్జీలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టి అధికారులకు వినతి పత్రాలు అందచేశాం.కూటమి ప్రభుత్వం రాకముందు హామీ ఇచ్చి మాట తప్పారు.పేద ప్రజల ఇబ్బందులు చూస్తుంటే బాధ వేస్తుంది.రెండు మూడు వందలు వచ్చే కరెంట్ బిల్లు నేడు వేయి రూపాయలు వస్తుంది. చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు ప్రజలను మోసం చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం ఛార్జీలు తగ్గించకుండా మరింతగా పెంచారు. సంక్షేమం,అభివృద్ధి లేకపోగా ఛార్జీల మోత మోగిస్తున్నారు. ప్రజలకు అన్యాయం చేస్తూ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తె ధరలు పెంచం,ఛార్జీలు పెoచo అని బాండ్ పేపర్లు ఇచ్చారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ప్రజల దగ్గరకు వెళ్తారు. ప్రజలను మోసం చేసిన నాయకులపై భవిష్యత్ లో పోలీసులకు ఫిర్యాదు కూడా చేస్తాం. ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఛార్జీలు పెంచకపోయిన తమ ప్రభుత్వం పై దుస్ప్రచరం చేశారు. ఇప్పుడు ప్రజలక్ ఏమి సమాధానం చెబుతారు. కూటమి నేతలు డబ్బులు దోచుకునే పనిలోనే ఉన్నారు. అధికారుల తీరు కూడా ఆశ్చర్యంగా ఉంది. వారు ఏమైనా కూటమి నేతలు దగ్గర జీతాలు తీసుకుంటున్నారా. మేము వినతిపత్రాలు ఇస్తామంటే భయంతో వణికిపోతున్నారు. మేము వచ్చేది ప్రజా సమస్యలు మీద మా ఇంటిలో సమస్యలు మీద కాదు. అధికారులు ప్రజలకు అన్యాయం చేస్తే జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అకాల వర్షాలతో పంట నష్టపోయినా రైతులను వదిలేశారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయటం లేదు. పేపర్ స్టేట్మెంట్ లు తప్ప వారిని అదుకోవటo లేదు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top