ఘనంగా జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవణ్ కళ్యాణ్ పుట్టినరోజు
NTODAY NEWS: విజయవాడ
జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 48, 51 ,53 డివిజన్ల కార్పొరేటర్ల అత్తులూరి ఆదిలక్ష్మి పెదబాబు మరుపిళ్ళ రాజేష్ మహదేవ్ అప్పాజీ ఆధ్వర్యంలో నెహ్రూ బొమ్మ సెంటర్లోని రాజా హై స్కూల్ వద్ద అంగరంగ వైభవంగా వేడుకలు జరగడం జరిగింది ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా విజయవాడ పార్లమెంట్ ఇంచార్జ్ అమ్మిశెట్టి వాసు జనసేన పార్టీ నాయకులు ఎస్ ఎన్ మూర్తి, జైన్ సేవాదళ్ సభ్యులు, చింతలపూడి సత్యనారాయణ పాల్గొని వారి చేతుల మీదుగా మరియు జన సైనికులు చేతుల మీదుగా గత విద్యా సంవత్సరంలో అత్యున్నత ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు ఉపకార వేతనాలను పంపిణీ చేశారు అనంతరం మూడు డివిజన్లోని శానిటరీ సిబ్బందిని సత్కరించి వారికి వర్షాకాలంలో ఇబ్బందులు లేకుండా రెయిన్ కోట్లను పంపిణీ చేశారు అలాగే నాయి బ్రాహ్మణ సోదరులకి 30 షాపులు వాళ్లకి అవసరమైన సెలూన్ కిట్లను అందించారు అనంతరం కేక్ కట్ చేసి పేదలకు చీరలు దుప్పట్లు పంపిణీ చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజుని ఘనంగా నిర్వహించడం జరిగింది.













