BREAKING
మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
www.ntodaynews.com

పేదింటి యువకుడి ప్రాణాలు కాపాడిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

తెలంగాణ
02 Nov, 2025 - 05:44 AM
232 వీక్షణలు
పేదింటి యువకుడి ప్రాణాలు కాపాడిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి NTODAY NEWS: మునుగోడు తన సొంత డబ్బు 12,50000 రూపాయల తో యువకునికి కార్పొరేట్ వైద్యం.కామినేని ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి చికిత్స(kidney transplantation Operation) చేయించిన రాజ్ గోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి చేసిన సహాయానికి జీవితాంతం రుణపడి ఉంటామంటున్న కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్న మునుగోడు నియోజకవర్గ ప్రజలు మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు గ్రామానికి చెందిన నిరుపేద యువకుడు నెల్లి గణేష్(26) గత కొద్ది కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు.. కిడ్నీలు దెబ్బతిన్నాయని కిడ్నీ మారిస్తే కానీ బ్రతకడని డాక్టర్లు చెప్పారు.. కిడ్నీ మార్పిడి చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చవుతాయని కూడా చెప్పారు.. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు అంత డబ్బు తమ దగ్గర లేకపోవడంతో భగవంతునిపై భారం వేసి రోజులు వెలదీస్తున్నారు.. నెల్లి గణేష్ ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుండడంతో విషయాన్ని స్థానిక నాయకులు మునుగోడు శాసనసభ్యుల దృష్టికి తీసుకువచ్చారు.. వెంటనే తన వ్యక్తిగత సిబ్బందిని ఆసుపత్రికి పంపించి కిడ్నీ మార్పిడి చికిత్స చేయడానికి కావలసిన ఏర్పాటు చూడాలని ఆదేశించారు... 12. 50 లక్షల రూపాయలను కామినేని ఆసుపత్రికి చెల్లించి గణేష్ కు కిడ్నీ మార్పిడి చికిత్స చేయించారు.. చికిత్స అనంతరం ఈరోజు కామినేని ఆసుపత్రికి వెళ్లి గణేష్ బాగోగులు తెలుసుకున్నారు.. గణేష్ కుటుంబ సభ్యులకు నేనున్నాను మీరు ధైర్యంగా ఉండండి అని భరోసా ఇచ్చారు.. తన కుమారునికి సొంత ఖర్చులతో కిడ్నీ మార్పిడి చికిత్స చేయించి కార్పొరేట్ వైద్యం అందించిన రాజగోపాల్ రెడ్డికి గణేష్ తల్లిదండ్రులు చేతులెత్తి నమస్కరించారు.. నా కుమారునికి పునర్జన్మ ప్రసాదించావన్నారు నెల్లి గణేష్ కు సొంత ఖర్చులతో కిడ్నీ మార్పిడి చికిత్స చేయించడంతో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉదార స్వభావానికి సహాయం చేసే గుణానికి నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు... Follow us on Website Facebook Instagram YouTube