భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయండి
NTODAY NEWS: భువనగిరి, ఏప్రిల్ 17
ఈనెల 21,22 తేదీలలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో జరిగే తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు బోలగాని సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ పిలుపునిచ్చారు.గురువారం రోజున భువనగిరిలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలకు సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డును రద్దు చేసే ప్రతిపాదనను ఉపసంహరించు కోవాలన్నారు, 50 సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికులకు రూ.5 వేలు పెన్షన్ ఇవ్వాలని ,ప్రసూతి మరియు వివాహ కానుకను లక్ష రూపాయలకు పెంచాలని, సహజ మరణానికి ఐదు లక్షలు, ప్రమాద మరణానికి 10 లక్షల బీమా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈనెల 21 22 తేదీలలో శంషాబాద్ పట్టణంలో జరిగే మహాసభలలో రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్తు పోరాట కార్యక్రమం రూపొందించడం జరుగుతుందని కావున యాదాద్రి భువనగిరి జిల్లా నుండి అత్యధికంగా భవన నిర్మాణ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు,
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి గనబోయిన వెంకటేష్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పబ్బల రాజు, ప్రధాన కార్యదర్శి బీరకాయల మల్లేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ దుబ్బాక సంజీవ, డిప్యూటీ కార్యదర్శి దాసరి లక్ష్మయ్య, సహాయ కార్యదర్శి బహుపేట వెంకటయ్య, జిల్లా కమిటీ సభ్యులు సామల శోభన్ బాబు, రాజపేట మండల కార్యదర్శి చిగుర్ల లింగం తదితరులు పాల్గొన్నారు.