మేడే కార్మికుల పోరాట స్ఫూర్తి కి చిహ్నం–సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు భట్టుపల్లి అనురాధ
NTODAY NEWS: భువనగిరి పట్టణం
మేడే కార్మికుల పోరాట స్ఫూర్తికి చిహ్నం అని రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ అన్నారు.గురువారం రోజున భువనగిరి పట్టణంలో ఘనంగా మేడే దినోత్సవం నిర్వహించడం జరిగింది. సింగన్నగూడెం, హౌసింగ్ బోర్డు కాలనీ,హన్మాన్ వాడ పట్టణంలోని సిపిఎం జెండా లను ఎగరవేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భట్టుపల్లి అనురాధ మాట్లాడుతూ అమెరికాలోని
1886లోఅమెరికాలో చికాగో నగరం హేమార్కెట్ లో 8 గంటల పని కోసం ఆందోళన చేస్తున్న సమయంలోపెట్టుబడిదారుల పక్షమైన పోలీసులు కార్మికులపై కాల్పులు జరిపి అనేకమంది ప్రాణాలు త్యాగాలు చేసి 8 గంటల పని దినాన్ని సాధించుకున్నారని తెలియజేశారు.ఆనాటి మేడే స్ఫూర్తికి విరుద్ధంగా నేడు మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడులను గా మార్చిందని 8 గంటల పని స్థానంలో 12 గంటల పనిని ప్రవేశపెట్టిందని మోదీ విధానాలపై ఐక్య పోరాటాలకుసిద్ధం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ , ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడ్య రాజు ,పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు గంధమల్ల మాతయ్య,కల్లూరి నాగమణి, కమిటీ సభ్యులు చింతల శివ,కొత్త లలి,తచింతల సత్యనారాయణ,మద్ది నరసింహ, బేర సంజీవ,లింగమూర్ కోటగిరి, నవీన్,అంజయ్,యకొత్త లక్ష్మయ్,నవనీత తదితరులు పాల్గొన్నారు.