రాములవారి పల్లకి సేవలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
(NTODAY NEWS ) కూనూరు మధు నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో శివాలయం కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ కళ్యాణ మహోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, దంపతులు హాజరయ్యారు . వారికి తెలంగాణ ధూప దీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు అనంతరం స్వామివారి పల్లకి సేవలో తరించారు ఈ సందర్భంగా నగరికల్ శాసనసభ్యులు మాట్లాడుతూ స్థానిక శివాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. అనంతరం ఇందిరా నగర్లో వెలసి ఉన్న రామాలయం ప్రాంగణంలో నిర్వహిస్తున్న కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు ఈ కార్యక్రమానికి శివాలయ కమిటీ సభ్యులు, కనకదుర్గ అమ్మవారి కమిటీ సభ్యులు, గ్రామంలో భక్త జనాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.