ఏలూరు జిల్లా జీలుగుమీల్లి మండలం రచాన్నగుడెం గ్రామంలో ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేయని బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్.. పంచాయతీలో గత సంవత్సర కాలంగా ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ పనిచేయక బిఎస్ఎన్ఎల్ సిమ్ములు ఉపయోగిస్తున్న సెల్ వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం అని ఓ పక్కన ఉద్యోగుల ప్రయత్నాలను ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న నిర్వీర్యం చేయటం పరిపాటిగా సాగుతుంది.ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం అని టాటా వంటి మహనీయులు ప్రభుత్వ రంగంలో వాటాలను కొనుగోలు చేసినప్పటికీ కొంతమంది అధికారులు తప్పిదాల వల్ల ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడంలో అలసత్వం కొనసాగుతుంది. ఇప్పటికైనా సెల్ఫోన్ వినియోగదారులకు బిఎస్ఎన్ఎల్ వినియోగాన్ని అందుబాటులో తీసుకురావడం వల్ల అనేక మంది బిఎస్ఎన్ఎల్ వినియోగాన్ని ఈ పంచాయతీలో ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించాలని వినియోగదారులు కోరుతున్నారు.
