News Headlines

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దేవరపల్లి మండల పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ

Spread the love

తూర్పుగోదావరి జిల్లాదేవరపల్లి మండలం దేవరపల్లి మండల పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ
డాక్టర్ పగడాల ప్రవీణ్ మృతి పై దేవరపల్లి మండల పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నాడు శాంతి ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ స్థానిక సంత మార్కెట్ నుండి పోలీస్ స్టేషన్ వరకు కొనసాగింది క్రైస్తవులపై దాడులు అరికట్టాలని పాస్టర్ ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలని పాస్టర్ల ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేస్తూ దేవరపల్లి బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించారు అసోసియేషన్ అధ్యక్షుడు ఇర్లపాటి డేవిడ్రాజు మాట్లాడుతూ డాక్టర్ పగడాల ప్రవీణ్ మృతిని చింతిస్తూ అసోసియేషన్ సభ్యులందరము శాంతి ర్యాలీ నిర్వహించమని అన్నారు ప్రవీణ్ కుటుంబానికి ప్రభత్వం న్యాయం చేయాలని అన్నారు వైస్ ప్రెసిడెంట్ ఈడూరి డేవిడ్ మాట్లాడుతూ డాక్టర్ ప్రవీణ్ కుటుంబానికి ప్రభుత్వం సహకారం అందించి న్యాయం చేయాలని అన్నారు క్రైస్తవులపై దాడులను అరికట్టాలని భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు వైస్ ప్రెసిడెంట్ కళానిధి మాట్లాడుతూ ప్రవీణ్ మృతి పై సమగ్ర విచారణ జరిగించాలని కోరారు మండల పాస్టర్ అసోసియేషన్ సభ్యులు శాంతి ర్యాలీ నిర్వహించి దేవరపల్లి పోలీస్ స్టేషన్లో వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో దేవరపల్లి మండల పాస్టర్ అసోసియేషన్ సభ్యులు జి యోహాను జేసురత్నం కోశాధికారి షే కినా బాబు దుగ్గిన షారోన్ ఈడురి విక్టర్పాల్ పిట్ట డేవిడ్ రాజ్ జై ఆనంద్ బాబు బేతిన జాన్ సుభాకర్ వి జాన్ పాల్ పాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top