BREAKING
జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత.. జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత..
www.ntodaynews.com

ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి

తెలంగాణ
09 Mar, 2026 - 04:41 AM
98 వీక్షణలు
ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా శాఖల వారీగా పెండింగ్ దరఖాస్తులపై సమీక్ష – సోమవారం 352 అర్జీలు స్వీకరణ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ ప్రజావాణి ద్వారా ప్రజల నుండి వచ్చే దరఖాస్తులకు అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ బాధితుల నుండి అర్జీలను స్వీకరించారు. దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం వద్దు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శాఖల వారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై స్వయంగా సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. అధికారులు తమ పరిధిలో ఉన్న అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా తక్షణమే పరిష్కరించాలని, ఒకవేళ ఇతర శాఖలకు సంబంధించినవి అయితే వెంటనే సంబంధిత విభాగానికి బదిలీ చేయాలని సూచించారు. మానవీయత చాటుకున్న కలెక్టర్ ప్రజావాణికి వచ్చిన వృద్ధులు, దివ్యాంగుల పట్ల కలెక్టర్ మానవీయత చాటుకున్నారు. వారు కూర్చున్న చోటకే స్వయంగా వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని దరఖాస్తులను స్వీకరించారు. సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 352 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డిఓ మహేశ్వర్ మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. #PrajaVani #Karimnagar #CollectorChitraMishra #PublicGrievances #TelanganaNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube