రేషన్ డీలర్ల కమిషన్ ను వెంటనే విడుదల చేయాలని అధికారులకు వినతి

Spread the love

రేషన్ డీలర్ల కమిషన్ ను వెంటనే విడుదల చేయాలని అధికారులకు వినతి

NTODAY NEWS: బొమ్మలరామారం

గత ఐదు నెలలుగా రేషన్ డీలర్లకు రావలసిన కమిషన్ రాక రేషన్ డీలర్ల కుటుంబాలు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే ప్రభుత్వం రేషన్ డీలర్ల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఐదు నెలల కమిషన్లను వెంటనే మంజూరు చేయాలని బొమ్మలరామారం రేషన్ డీలర్ల సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో తాహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ల సంఘం మండల శాఖ అధ్యక్షులు ధీరావత్ దశరథ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం రేషన్ డీలర్లకు ఇస్తానన్న గౌరవ వేతనం ఇవ్వడం లేదని కనీసం ప్రతినెల డీలర్లకు రావలసిన కమిషన్ కూడా ఐదు నెలల నుండి రాకపోవడంతో డీలర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆయన అన్నారు మూడు నెలల బియ్యాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే నెలలో అమ్మాలని ఆదేశాలు ఇవ్వడంతో ఎన్నో సాధక బాధకాలు భరించి కూడా ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జులై, ఆగస్టు, సెప్టెంబర్ మూడు నెలల బియ్యాన్ని ప్రజలకు అందించామని ఆయన తెలిపారు ఆ మూడు నెలల కమిషన్ తో పాటు అంతకుముందు రెండు నెలల కమిషన్ కలుపుకొని ఇప్పటివరకు డీలర్లకు ఐదు నెలల కమిషన్ రాకపోవడంతో డీలర్లు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆయన ఆవేదన వెలిబుచ్చారు రేషన్ డీలర్ల రాష్ట్ర సంఘం పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్త నిరసనలో భాగంగా సోమవారం తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపి తాహసిల్దార్ శ్రీనివాసరావు, ఆర్ఐ వెంకటరెడ్డికి తక్షణమే కమిషన్ చెల్లించాలని వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు పాల్గొన్నారు

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Translate »