సంగమేశ్వర ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఘనంగా 30వ వార్షికోత్సవం…
మండల విద్యాశాఖ అధికారి మహమ్మద్ గౌస్, పాఠశాల కరస్పాండెంట్ లోకనాథ్…
ఉరవకొండ (కూడేరు) ఏప్రిల్ 7 NTODAY న్యూస్-మధు కూడేరు మండల రిపోర్టర్
కూడేరు మండలం కూడేరు గ్రామం నందు మండల కేంద్రంలోని శ్రీ సంగమేశ్వర ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సోమవారం 30 సంవత్సరాల వార్షికోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు, ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి మహమ్మద్ గౌస్, రవి కృప గ్రూప్ సంస్థ లు అధినేత రవికృప వన్నూరప్ప, వివిధ పాఠశాల కరెస్పాండెట్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 1998 వ సంవత్సరంలో పాఠశాలను ప్రారంభించడం జరిగిందని, ఇప్పటికీ 2025 సంవత్సరానికి 30వ వార్షికోత్సవాలకు వెళ్లడం జరిగిందని, ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యాన్ని కరస్పెండెంట్ లోకనాథ్ ని పలువురు అభినందించారు ప్రశంసించారు, సంగమేశ్వర స్కూల్ నందు విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు, మంచి క్రమశిక్షణ, వీటితోపాటు ఆటపాటలతో విద్యార్థినీ విద్యార్థులకు మంచి లోకజ్ఞానం కూడా విద్యార్థులకు తెలియజేస్తున్నట్లు వారు తెలియజేశారు, విద్యార్థినీ విద్యార్థులు సాంస్కృత కార్యక్రమాలు తల్లిదండ్రులకు గ్రామ ప్రజలకు ఎంతగానో ఆకట్టుకున్నాయి, పిల్లలు దేశ నాయకుల పాటలతో డ్యాన్సులు తల్లిదండ్రులకు అబ్బరపరిచి సంతోషపరిచారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube