కక్కిరేణి గ్రామంలో బడిబాట కార్యక్రమం
(NTODAY NEWS) ఏప్రిల్ 10 కూనురు మధు నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్
రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం ఈ రోజు ఐకెపి సెంటర్ లో ఉన్న తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించాలని కోరుతూ హమాలీల వద్దనే బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు భీమిడి ఉపేందర్ పాల్గొని వారు మాట్లాడుతూ పాఠశాలలో ప్రభుత్వం అందిస్తున్న మెరుగైన సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు ప్రవేట్ పాఠశాలల కంటే మించి ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందిస్తూ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే అవకాశం ఉందని, తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాల పరిరక్షణ కోసం కృషి చేయాలని , ప్రతినెల తల్లిదండ్రుల సమావేశంలో తల్లిదండ్రులు పాల్గొని ప్రగతి సమీక్ష లో మీ యొక్క సూచనలు సలహాలు ఇచ్చి పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని వారు కోరారు అనంతరం గురుకుల పాఠశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. ఐదో తరగతి గురుకుల ప్రవేశ పరీక్షలో పదిమంది ఉత్తీర్ణులు అయితే అందులో ఆరుగురికి మొదటి పేజ్ లో చిల్ల జశ్విత , కొంపెల్లి శ్రీ హర్షిత , కన్నేబోయిన ఉషశ్రీ , అంకిరెడ్డి జశ్విక , కన్నేబోయిన వర్షిని , బేక్కంటి వరలక్ష్మి లకు గుర్తింపు పొందిన గురుకులాలలో సీటు లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎలాంటి కోచింగ్ లేకుండా ఉపాధ్యాయులే ప్రత్యేక చొరవ చూపించి తల్లిదండ్రులకు భరోసా కల్పించి విద్యార్థులకు గురుకులాలలో సీటు రావడానికి కృషి చేసిన ఉపాధ్యాయులను అభినందించారు విద్యార్థులకు పలువురు గ్రామ పెద్దలు శుభాకాంక్షలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు జి.గణేష్ , పి. గోపాల్ రెడ్డి , కే.కృష్ణ , స్వర్ణలత తో పాటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనుమంతరావు , అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ చిల్ల ప్రేమలత , సామాజిక కార్యకర్త వేముల సైదులు , కన్నేబోయిన యాదయ్య , కొంపెల్లి నరసింహ , నల్ల మాధురి, కనకమ్మ , అండాలు , భిక్షం నరసింహ ,కిషన్ రావు లింగస్వామి , రమేష్ తదితరులు పాల్గొన్నారు.