వేసవి సెలవులను విద్యార్థులు ప్రణాళిక బద్దంగా సద్వినియోగం చేసుకోవాలని బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ సురేంద్ర సూచించారు
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలోని శాఖా గ్రంథాలయంలో నిర్వహించు వేసవి విజ్ఞాన శిబిరానికి యర్నగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ బ్రాంచ్ మేనేజర్ గుడివాడ సురేంద్ర కుమార్ నాయుడు ముఖ్య వక్తగా విచ్చేసారు
విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణా శిబిరంను ప్రతీ ఒక్క విద్యార్ధి సద్వినియోగం చేసుకోవాలని వేసవి సెలవలను వృథా చేసుకోరాదని ప్రణాళికా బద్దంగా సమయాన్ని ఉపయోగించుకోవాలని ముఖ్యంగా సెల్ ఫోన్ వాడకం పట్ల అవగాహన కలిగి ఉండాలని అవసరమైన మేర మాత్రమే ఫోన్ ఉపయోగించాలని సురేంద్ర విద్యార్థులకు తెలిపారు
బ్యాంక్ ఆఫ్ బరోడా తరుపున విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు సురేంద్ర అందించారు
కార్యక్రమంలో ఫిజికల్ ట్రైనర్ మరపట్ల మురళి పుట్టా పోసిబాబు ముంగర అయ్యన్న లైబ్రేరియన్ జి అనిత తదితరులు పాల్గొన్నారు