బడి తరువాత విద్యాబోధన కార్యక్రమం విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

Spread the love

బడి తరువాత విద్యాబోధన కార్యక్రమం విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని హెచ్ఎం రామలక్ష్మి అన్నారు

NTODAY NEWS

దేవరపల్లి మండలం యర్నగూడెం మెయిన్ ఎలిమెంటరీ స్కూల్ నందు పార్డ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ నిర్వహించే బడితరువాత విద్యా బోధన శిక్షణా తరగతులను ప్రధానోపాధ్యాయని రామలక్ష్మి ప్రారంభించారు
ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు బడితరువాత విద్యా బోధనలు అందిస్తూ వారికి విద్యా సామాగ్రి ఇస్తూ మరింత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు దశాబ్ద కాలంగా కృషి చేస్తున్న పార్డ్ ఇండియా సంస్థ సేవలు అభినందనీయమని రామలక్ష్మి అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో పలుచోట్ల పార్డ్ ఇండియా సంస్థ బడి తరువాత విద్యా బోధన నిర్వహిస్తుందని కార్యక్రమం విద్యార్థుల్లో మంచి ఫలితాలను అందిస్తుందని ఇర్కాన్ సంస్థ సహకారం అందిస్తుందని పార్డ్ ఇండియా వ్యవస్థాపకులు బీవీ స్వామి కార్యక్రమాన్ని మరింత విస్తృత పరిచేందుకు కృషి చేస్తున్నారని సంస్థ సభ్యులు సోమశెట్టి వెంకటరావు అన్నారు. ఉపాద్యాయులు మహేష్ సుధాకర్ విష్ణు బేతాల నాగమణి సంస్థ సభ్యులు దేవరాజు అచ్చుతరావు ధూళిపూడి రవీంద్ర సత్యనారాయణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Translate »