అంగన్వాడీ స్కూల్స్ కు వేసవి సెలవులు ప్రకటించాలి …….సిఐటియు
ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి యం.మహేష్, ఇబ్రహీంపట్నం.
అంగన్వాడి స్కూల్స్ కి ఎండల తీవ్రత రీత్యా తక్షణమే వేసవి సెలవులు ప్రభుత్వం ప్రకటించాలని సిఐటియు ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి ఎం మహేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈరోజు జరిగిన ఇబ్రహీంపట్నం మండల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) సర్వసభ్య సమావేశంలో నిరసన తెలియజేసి అంగన్వాడి సమస్యల పరిష్కారానికి పెరిగిన ధరలు వైద్య విద్య ఖర్చుల రీత్యా జీతాల పెంపు చేయాలని,సమ్మె కాలపు ఒప్పందాలు అమలు చేయాలని,మినీ సెంటర్స్ మెయిన్ సెంటర్స్ మార్పు చేయాలని , పిఎఫ్ ఈఎస్ఐ లాంటి చట్టబద్ధ సౌకర్యాలు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ కి ఇవ్వాలని , హెల్త్ బెనిఫిట్స్ ప్రకటించాలని గర్భిణీ స్త్రీలకు చిన్నపిల్లలకు ఆహార పోషణకు నిరంతరం శ్రమించే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు… ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం సెక్టార్ లీడర్ కే బుల్లెమ్మ , ఈలప్రోలు సెక్టార్ లీడర్ నిర్మల , కేతనకొండ సెక్టార్ లీడర్ రబ్బాని అంగన్వాడీ వర్కర్స్ ముంతాజ్, నాగలక్ష్మి,పి నిర్మల, అచ్చమ్మ అలివేలు, శాంతి శ్రీ, జ్యోతి, అరుణ, కృష్ణ కుమారి, సరిత తదితరులు పాల్గొన్నారు.