BREAKING
చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం
www.ntodaynews.com

నిందితునికి 21 ఏళ్ళ కారాగార శిక్ష

తెలంగాణ
15 Sep, 2025 - 07:18 PM
378 వీక్షణలు
ఫోక్సొ కేసులో సంచలన తీర్పునిచ్చిన నల్గొండ ఫోక్సో ఇన్చార్జి న్యాయస్థానం NTODAY NEWS: చిట్యాల నిందితునికి 21 ఏళ్ళ కారాగార శిక్ష 30000 జరిమానా, 10 లక్షలు నష్టపరిహారం: నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో 8 ఏళ్ల క్రితం మూడో తరగతి చదువుతున్న 8 ఏళ్ల మైనర్ బాలికపై బలవంతంగా ఒక వ్యక్తి అత్యాచారం చేసిన సంఘటనపై ఎనిమిదేళ్ల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం నల్గొండ ఫోక్సో ఇన్చార్జి న్యాయస్థానం నిందితునికి 21 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువడించింది. వివరాల్లోకి వెళితే తేదీ ఫిబ్రవరి 1, 2018 న నల్గొండ జిల్లా, చిట్యాల మండలం, వనిపాకల గ్రామానికి చెందిన మూడవ తరగతి చదివే మైనర్ బాలిక (8) ఇంట్లో టీవీ చూస్తుండగా అదే గ్రామానికి చెందిన దోమల రాములు తాగిన మైకంలో అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి మైనర్ బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి తండ్రి ఫిబ్రవరి 11, 2018 న స్థానిక చిట్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. స్థానిక పోలీసులు ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఎనిమిదేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం సోమవారం ఫోక్సో న్యాయస్థానం ఇన్చార్జి న్యాయమూర్తి రోజా రమణి నిందితునికి 21 సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా 30,000 రూపాయలు జరిమానా విధించడంతో పాటు బాదితురాలికి 10 లక్షలు నష్టపరిహారం కింద ప్రకటించింది. Follow us on Website Facebook Instagram YouTube