ట్రూలైట్ ఇంగ్లీష్ స్కూల్ ప్రారంభోత్సవం చేసిన వ్యవసాయ వేత్త ఋషి కేశవరావు
దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలో నూతనంగా ప్రారంభించిన ట్రూ లైట్ ఇంగ్లీష్ స్కూల్ ను ప్రముఖ వ్యవసాయ వేత్త పిన్నమనేని ఋషి కేశవరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభోత్సవం చేశారు. సమాజ ఉన్నతికి విద్య మాత్రమే అత్యంత దోహదం చేస్తుందని విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే అని తెదేపా నాయకులు పెన్మెత్స సుబ్బరాజు అన్నారు. కేరళ విద్యావిధానంతో విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందిస్తూ వారిలోని ప్రతిభను వెలికితీసి ఉన్నతులుగా తీర్చిదిద్దే దిశగా ట్రూలైట్ ఇంగ్లీష్ స్కూల్ లక్ష్యంగా పనిచేస్తుందని కరస్పాండెంట్ రాయ్ తెలిపారు. ప్రారంభోత్సవానికి తెదేపా నాయకులు బళ్ల సూర్యచక్రం మండ సుబ్బారావు ప్రత్తిపాటి హరినాథ్ పాలపాటి వెంకటగిరి టెక్కెం చిట్టిబాబు పాలూరి బాలాజీ తదితరులు పాల్గోన్నారు.