భూభారతి చట్టం పేదల పాలిట గొప్ప వరం-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
NTODAY NEWS: బొమ్మలరామారం, ఏప్రిల్ 21
భూభారతి చట్టం పేదల పాలిట గొప్ప వరమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మాలరామారం మండల కేంద్రంలో సోమవారం రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భూభారతి చట్టం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వీరితోపాటు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు,అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి,ఆర్డిఓ కృష్ణ రెడ్డి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం జ్యోతి ప్రజ్వలన నిర్వహించి భూభారతి చట్టం పోస్టర్ ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మాట్లాడుతూ భూ భారతి చట్టం రైతుల చట్టం భూ వివాదల శాశ్వత పరిష్కారానికి తెచ్చిందే భూ భారతి చట్టం అన్నారు.ప్రతి వ్యక్తికి ఆధార్ లాగా ప్రతి భూమికి భూదార్ ని చెప్పారు.భూమి రికార్డులను మోసపూరితంగా మార్చి ప్రభుత్వ ,భూధాన్,అసైన్డ్, దేవాదాయ,భూములను ఎవరైనా పట్టా చేసుకుంటే వాటిని రద్దు చేసేలా సీసీఎల్ఏ కి అధికారాలు ఉంటాయన్నారు. కొత్త చట్టంలో అప్పీలు వ్యవస్థ తెచ్చమని, ఎవరి భూమి అయిన వేరే వాళ్ళకు తప్పుగా నమ్ముదైతే ఎమ్మార్వో, ఆర్డీవో,జేసీ,కలెక్టర్,కు అప్పీలు చేసుకొని పరిష్కరించుకోవచ్చాన్నారు ప్రతి గ్రామానికి గ్రామ పరిపాలన అధికారులను నియమించడంతో రైతులకు అన్ని సేవలు గ్రామంలోని అందుతాయన్నారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసి రైతులకు ప్రజలకు అన్ని సేవలు అందించేలా ఉపయోగపడుతుందన్నారు..
ధరణి వల్ల రైతులు భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఆర్ఓఆర్ చట్టం భూభారతితో సులభంగా పరిష్కారం అవుతుందన్నారు. ధరణి రిజిస్ట్రేషన్ లో పొరపాటు జరిగిన సరిదిద్దుకునే అవకాశం ఉండేది కాదని రైతులు పేదలు కోట్ల చుట్టూ తిరగాల్సి వచ్చేదాని అన్నారు. ధరణి అన్నదమ్ములు కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు పెట్టిందని విమర్శించారు. ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం మొత్తం పారదర్శకంగా ఉంటుందని ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు సంజీవరెడ్డి, మదర్ డైరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిర్తి మల్లేశం, భువనగిరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బైస్ రాజేష్ పైలెట్, పిఎసిఎస్ చైర్మన్ గుదే బాల నరసింహ, పిఎసిఎస్ వైస్ చైర్మన్ ఏనుగు కొండల్ రెడ్డి, మండల తహసిల్దార్ పి. శ్రీనివాసరావు, మండల స్పెషలాఫీసర్ జ్యోతి కుమార్, ఎంపీడీవో రాజా త్రివిక్రమ్, ఆర్ఐ వెంకట్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ శోభారాణి, ఏఆర్ఐ నరేష్, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ రాములు నాయక్, మహిళా అధ్యక్షురాలు సునీత, మాజీ జెడ్పిటిసి మర్రి కృష్ణారెడ్డి, రాంపల్లి మహేష్ గౌడ్, రామిడి రామిరెడ్డి, రాష్ట్ర ఆదివాసి సెక్రెటరీ రాజు నాయక్, భువనగిరి మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేశెట్టి చంద్రశేఖర్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రామిడి శ్రావణ్ ప్రసాద్ రెడ్డి, రామిడి జంగారెడ్డి, మాజీ ఎంపీటీసీ ఫకీర్ రాజేందర్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, గంగాదేవి హనుమంతు, సింగిరెడ్డి జితేందర్ రెడ్డి, వట్టిపల్లి సుదర్శన్, మండల వివిధ శాఖల అధికారులు, వివిధ పార్టీల నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.