ఎల్లప్పుడూ ప్రజా సమస్యలపై సిపిఐ పోరాటం

Spread the love

ఎల్లప్పుడూ ప్రజా సమస్యలపై సిపిఐ పోరాటం

-ఘనంగా సీపీఐ శత వార్షికోత్సవాలు

NTODAY NEWS : చిట్యాల

ఎల్లప్పుడూ ప్రజా సమస్యలపై సిపిఐ పోరాటం చేస్తుందని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి లోడింగ్ శ్రవణ్ కుమార్ అన్నారు. సిపిఐ 100 వార్షికోత్సవాల సందర్భంగా సీపీఐ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసే కుట్రలో భాగంగా ఆ పథకం పేరు మార్చడం జరుగుతుందని పెట్టుబడి దారి విధానానికి వ్యతిరేకంగా సిపిఐ ఉద్యమిస్తుందని అన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా సిపిఐ ప్రజా ఉద్యమాలకు సిద్ధమవుతుందని అన్నారు. ఈ సందర్భంగా దేశగోని బాలరాజు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఎండి అక్బర్, మండల సహాయ కార్యదర్శి జిల్లా సత్యం, పట్టణ కార్యదర్శి ఎస్కె షరీఫ్, దేవేందర్, దండిగా నరసింహ, రావుల చిన్న వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Translate »