హర్ ఘర్ తిరంగా ఊరు వాడ మువ్వెన్నాల జెండా..
NTODAY NEWS: లక్ష్మిప్రసాద్ నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి
•నర్సాపూర్ వ్యాప్తంగా ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు..
నర్సాపూర్ శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రభుత్వ కార్యాలయం. పాఠశాల కళాశాలల్లో. గ్రామపంచాయతీ.కార్యాలయ వద్ద ఉదయం జాతీయ జెండా పతాకవిష్కరణ చేసిన అధికారులు. పంచాయతీ కార్యదర్శులు.. స్వాతంత్ర ఉద్యమంలో చనిపోయిన యోధులను స్మరించుకున్నారు.. విద్యార్థులు నాటి స్వతంత్ర ఉద్యమ చరిత్రను తెలుసుకువాలి … అభివృద్ధి దిశలో అమెరికా చైనా వంటి దేశాలతో పోటీ పడుతున్న భారతదేశన్ని, రెండు కన్నులుగా నిత్యం దేశాన్ని కాపాడుతున్న భారత త్రివిధ దళాల సైనికులకు అలాగే కడుపునిండా అన్నం పెడుతున్న రైతన్నకు ఈ తరం యువత తోడుగా నిలిచి భారతదేశాన్ని అగ్రగామి దేశంగా నిలిచే వరకు కృషి చేయాలి . నేటి బాలలే రేపటి పౌరులు అనే మాటను నిజం చేయాలి, రాబోయే రోజుల్లో ఈ భారతదేశం యొక్క యువత దేశ రాజకీయాలను శాసించే దిశగా ముందడుగు వేయాలి, ఆపత్కాలంలో దేశాన్ని రక్షించుకునేందుకు ప్రతి ఒక్క విద్యార్థి ఒక సైనికుడిగా ప్రతి ఒక్క యువత ఒక సేవకుడిగా ముందుకు వచ్చి తమ దేశాన్ని కాపాడుకోవాలని.. తమ సందేహం ద్వారా విద్యార్థులకు తెలియజేసారు పలువురు నాయకులు…ఇ కార్యక్రమంలొ పాఠశాల్లో నిర్వహించిన ఆటల్లో గెలుపొందిన విద్యార్థులకు పలురకాల బహుమతులు అందజేస్తూ . దేశ భక్తి ఉట్టిపడేలా పలు సంస్కృతిక నృత్యాలతో.పాటు విద్యార్థుల పాటలు ఉపన్యాసలతో ఘనంగా వేడుకలను జరుపుకున్నారు.













