ప్రతి పేదవాడి కడుపు నింపడమె ప్రభుత్వ లక్ష్యం — మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి
(Ntoday News ) కూనురు మధు నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్.
నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో ఉన్న ఉరుమడ్ల గ్రామంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మరియు నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం ప్రభుత్వం చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం పంపిణీ చేసిన సన్న బియ్యంతో వండిన అన్నం గ్రామం లో నీ దళితవాడలో ఉంటున్న జనార్ధన్ ఇంటివద్ద మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీ ద్వారా ప్రతి ఒక్క పేదవాడి ఇంటికి సన్న బియ్యం ద్వారా ఆకలి తీరుతుందని, గతంలో పంపిణీ చేసిన బియ్యం అమ్ముకునేవారని ఈ పథకం ద్వారా ప్రతి ఒక్కరు కడుపునిండా అన్నం తినగలుగుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే సహకారంతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నామని. తన స్వగ్రామమైన ఉరుమడ్ల అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని తమ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉందని 1996లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ద్వారా శ్రమదానం కార్యక్రమాన్ని ఈ గ్రామం నుంచే ప్రారంభించామని గతాన్ని గుర్తు చేశారు వీటితోపాటు పలు గ్రామాలకు అనుసంధానమైన లింకు రోడ్లను మరింత అభివృద్ధి పరిచేలా చర్యలు తీసుకుంటామని ఈ రోడ్ల అభివృద్ధికి ప్రస్తుతం హెచ్ డి ఎఫ్ తరఫున 6 కోట్ల రూపాయలు విడుదల చేశామని అన్నారు ఈ కార్యక్రమానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలంగాణ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, పార్టీ శ్రేణులు, గ్రామంలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.