మేడే అమరవీరుల స్ఫూర్తితో కార్మిక వర్గం ఉద్యమాలకు సిద్ధం కావాలి–దాసరి పాండు
సిఐటియు జిల్లా అధ్యక్షులు
NTODAY NEWS: భువనగిరి పట్టణం
మేడే అమరవీరుల స్ఫూర్తితో కార్మిక వర్గం ఉద్యమాలకు దాసరి పాండు అన్నారు 139వ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలో మండలంలో ఉన్న హమాలి మున్సిపల్ భవన నిర్మాణం గ్రామపంచాయతీ తదితర రంగాల జెండాలను ఎగురవేసుకొని భువనగిరి పట్టణంలోని ఉన్న జూనియర్ కళాశాల గ్రౌండ్ లో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మాయ కృష్ణ అధ్యక్షతన అధ్యక్షతన సభ నిర్వహించారు ఈ సందర్భంగా దాసరి పాండు మాట్లాడుతూ అమెరికా దేశంలో చికాగో నగరంలో హే మార్కెట్లో పెట్టుబడుదారులు కార్మికులతో 12 గంటలు పని చేయించుకుంటూ ఎలాంటి కార్మిక చట్టాలను అమలు చేయకుండా శ్రమదోపిడి చేస్తున్న రోజుల్లో కార్మిక వర్గం కుల మతం ప్రాంతం ఆడ మగ అనే తేడా లేకుండా ఐక్యంగా పోరాటం చేసి ఎనిమిది గంటల పని దినం కావాలని కార్మిక చట్టాలు కావాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సందర్భంగా అమెరికా సామ్రాజ్యవాదం పోలీసు లతో కాల్పులు జరిపి అనేకమంది కార్మికులను చంపడం జరిగిందని చాలామంది శతఘాతులయ్యారని
ఆ పోరాట ఫలితమే ఏర్పడిన రోజు మేడే అని కార్మికులు దిక్సూచి తీసుకోవాలని కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టాలను హక్కులను కార్పొరేట్ శక్తులకు కార్మికులకు పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ చట్టసభల్లో అనేక రకమైన బిల్లును తీసుకొస్తూ 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లుగా చేసి సామాజిక భద్రత అయిన ఈ ఎస్ ఐ పి ఎఫ్ మహిళలకు రక్షణ సౌకర్యాలు లాంటివి అమలు చేయకుండా యాజమాన్యాలకు వత్తాసు పలుకుతూ బ్రిటిష్ వారి కంటే ఎక్కువ కార్మికులతో పని చేయించుకుంటూ శ్రమను దోచుకుంటున్నారని ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన కార్మికుల బతుకుల్లో మార్పు రాలేదని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని రంగాల కార్మికులకు కనీస వేతనాలు కార్మిక చట్టాలు అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి అధికారులకు వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక విధానాల అవలంబించే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం మేడే అమరవీరుల స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలని వారు అన్నారుఈ కార్యక్రమంలో
జిల్లా అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలువేరు రామకుమారి, సిఐటియు పట్టణ కన్వీనర్ గంధ మల్ల గంగ, మల్ల మాతయ్య, హమాలి వర్కర్స్ యూనియన్ నాయకులు సత్తయ్య, వెంకటేశం, రామకృష్ణారెడ్డి, భవన నిర్మాణ కార్మిక యూనియన్ నాయకులు ప్రసాద్, ఎల్లమ్మ, లక్ష్మమ్మ, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు రాజయ్య, రవి, వరమ్మ, శాంతమ్మ, లక్ష్మీ, రాణి తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube