చిట్యాల లో ఘనంగా ఉగాది కవి సమ్మేళనం
హాజరైన మండలి చైర్మన్ పర్సనల్ సెక్రెటరీ అడిషనల్ కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, విశ్రాంత న్యాయమూర్తి కుంకుడాల లక్ష్మణ్
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో కనకదుర్గ ఆలయం ప్రాంగణం లో. ప్రమోద సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సాహితీవేత్త మండలి చైర్మన్ పర్సనల్ సెక్రెటరీ అదనపు కలెక్టర్ కలెక్టర్ ఏనుగు నరసింహ రెడ్డి , విశ్రాంత న్యాయమూర్తి కుంకుడాల లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ధూప దీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ చే పంచాంగ పఠనం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రమోద సాహితీ సంస్థ ఉగాది విశిష్ట పురస్కార గ్రహీతలు డాక్టర్ సాగర్ల సత్తయ్య, , పాటి మోహన్ రెడ్డి, ముత్యాల ప్రకాష్, సర్దార్ బహదూర్ సింగ్ లను ఘనంగా సన్మానించారు. అనంతరం చిట్యాల పరిసర ప్రాంతాల్లో నుంచి వచ్చిన కవులు తమ కవితలను వినిపించారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రమోద సాహితి సంస్థ వారిచే ఉగాది కవి సమ్మేళనం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. కవి కవిత్వం రాయడంలో తన జీవితం సగం వరకు ఆలోచించడానికి సరిపోతుందని ఒక కవి ప్రశంసల కోసం కవిత్వాలు రాయడని తమ లక్ష్యాన్ని చేరుకునేలా కవితలు రాస్తారని అన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్, మహాత్మా గాంధీ, వంటి గొప్ప కవుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు ఈ కవి సమ్మేళనంలో తన చిన్ననాటి జ్ఞాపకాలు అనుభవాలను పంచుకున్నారు ఈ కార్యక్రమంలో గౌరవ అతిధి b శ్రీమతి నర్రా వినోదమోహన్ రెడ్డి, వ ప్రమోద సాహితీ అధ్యక్షులు కందిమల్ల కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి తాడూరి చంద్రం, ఉపాధ్యక్షులు, సిలివేరు నరసింహ, అద్దెల లక్ష్మారెడ్డి, కోశాధికారి సిలువేరు కృష్ణ, కార్యదర్శులు, జిట్టా రాజు, సోమిరెడ్డి శంకర్ రెడ్డి, సిలువేరు యాదగిరి, నర్రా బిక్షం రెడ్డి, గౌరవ సలహాదారులు కుంకుడాల గోవర్ధన్, కోమటిరెడ్డి రవీందర్ రెడ్డి, డాక్టర్ సాగర్ల సత్తయ్య, పగిడిపాటి నరసింహ, కార్యవర్గ సభ్యులు, పట్టణపుర ప్రముఖులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు