మహిళా ఆర్థిక అభివృద్ధి తమ ప్రభుత్వ దేయం

Spread the love

మహిళా ఆర్థిక అభివృద్ధి తమ ప్రభుత్వ దేయం

NTODAY NEWS లక్ష్మి ప్రసాద్ నర్సాపూర్ ప్రతినిధి

1.రూల్స్ ప్రకారమే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం.
2.నర్సాపూర్ కు అన్ని అన్ని విధాలా సహకారం
నర్సాపూర్ మహిళా శక్తి సంబురల కార్యక్రమంలొ కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి

నర్సాపూర్ ప్రభుత్వ రూల్స్ ప్రకారమే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేసుకోవాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి లబ్ధిదారులకు సూచించారు.అన్ని స్కీమ్ లల్లో ప్రభుత్వం మహిళను భాగ్యస్వామ్యం చేస్తుంది అని చెప్పారు. నర్సాపూర్ లొ జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబురాల కార్యక్రమంలొ అయినా పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్టంలొ కొత్త రేషన్ కార్డుల పంపిని కార్యక్రమం జరుగుతుందని. నర్సాపూర్ కు కొత్తగా 2.500కొత్త రేషన్ కార్డులు ఇస్తాం అని అయన ప్రకటించారు. ఒక మహిళా ఆర్థికంగా నిలబడితేనే కుటుంబానికి అండగా ఉంటుందన్న మంత్రి అందుకే మహిళా సంఘాలకు వడ్డీలేని రుణలను అందిస్తున్నట్లు అయన చెప్పారు. తీసుకున్న రుణలను సరైన సమయంలొ తిరిగి చెల్లించాలని మంత్రి విజ్ఞప్తి చేసారు. రాష్టంలో మహిళలందరికి ఫ్రీ బస్సు సౌకర్యంతో పాటు 500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నట్లు వివరించారు. సీఎం రిలీఫ్ ఫండ్ తో చాలా మంది పేద ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. విద్యరంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలొ పలు బిటిరోడ్డు నిర్మాణ పనులతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను అయన ఈ సందర్బంగా ప్రారంభించరు. కొత్తగా చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేసారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Translate »