వైఎస్ఆర్ సిపి యర్నగూడెం గ్రామ కమిటీ అధ్యక్షునిగా బళ్ల సత్యనారాయణ
NTODAY NEWS:- తూర్పుగోదావరి జిల్లా,
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలో వైఎస్ఆర్ సిపి పార్టీ మండల అధ్యక్షులు కూచిపూడి సతీష్ అధ్యక్షతన వైసీపీ శ్రేణులతో సమావేశం నిర్వహించి గ్రామ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. గ్రామ కమిటీ అధ్యక్షునిగా బళ్ల సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికఅయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా పుట్టా దైవ వరప్రసాద్, మామిడిపల్లి సుధీర్ కుమార్, మట్టా సత్యనారాయణ, గాడి పెద్దిరాజు కార్యదర్శులుగా తానుకొండ రామకృష్ణ, వడ్డి నీలవేణి, శీలా బుచ్చియ్య, గంజి పెంటయ్య అనుబంధ కమిటీ అధ్యక్షులుగా కర్రి శివారెడ్డి ప్రధాన కార్యదర్శులుగా వాసా బత్తుల వెంకీ, బుడిగిన జగ్గయ్య కార్యదర్శులుగా గంజి వీరాస్వామి నిడదవోలు రామబ్రహ్మం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సమావేశంలో గ్రామ సర్పంచ్ బొంతా భరత్ బాబు, నరహరిశెట్టి రాజేంద్రబాబు, గెడ రాంబాబు, కుసులూరి సతీష్, సత్తి జగదీశ్వర రెడ్డి, నరహరశెట్టి సుధాకర్, నరహరిశెట్టి దొరబాబు, బొంత చినబాబు, జువ్వల ఆనందరావు, పుట్టా జగన్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.













