మొక్కలు నాటిన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్

Spread the love

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శ్రీమతి ఘంటా పద్మ శ్రీ ప్రసాద్ స్వయంగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ — “పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. భవిష్యత్ తరాల కోసం పచ్చదనం పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి. ఒక్కో మొక్క నాటడం వలన పర్యావరణానికి ఉపయోగం కలుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలి” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధికారులతో పాటు ఉద్యోగులు, పాల్గొన్నారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top