BREAKING
కొలుసు పార్థసారథి జన్మదినం పురస్కరించుకుని సూరంపాలెంలో కూలింగ్ మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభం భూదాత వెదిరే రామచంద్ర రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో. వాతావరణ శాఖ హెచ్చరిక: రాబోయే రోజుల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కొలుసు పార్థసారథి జన్మదినం- ప్రజల సేవకు అంకితం ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, కొండపర్వ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ర్యాలీ పెనుగొలను శాఖా గ్రంథాలయంలొ స్వాతంత్ర్య సమరయోధి తాంతియా తోపే వర్ధంతి నవోదయం 2.0 కార్యక్రమం -నాటు సారా నిర్మూలనపై చర్యలు మున్సిపల్ ట్రాక్టర్ల నిర్లక్ష్యం రోడ్లపైనే రాలుతున్న చెత్త.. మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ సీనియర్ నేత బొట్టు లక్ష్మణరావు మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన యువనేత చాగంటి రాధాకృష్ణ కొలుసు పార్థసారథి జన్మదినం పురస్కరించుకుని సూరంపాలెంలో కూలింగ్ మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభం భూదాత వెదిరే రామచంద్ర రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో. వాతావరణ శాఖ హెచ్చరిక: రాబోయే రోజుల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కొలుసు పార్థసారథి జన్మదినం- ప్రజల సేవకు అంకితం ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, కొండపర్వ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ర్యాలీ పెనుగొలను శాఖా గ్రంథాలయంలొ స్వాతంత్ర్య సమరయోధి తాంతియా తోపే వర్ధంతి నవోదయం 2.0 కార్యక్రమం -నాటు సారా నిర్మూలనపై చర్యలు మున్సిపల్ ట్రాక్టర్ల నిర్లక్ష్యం రోడ్లపైనే రాలుతున్న చెత్త.. మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ సీనియర్ నేత బొట్టు లక్ష్మణరావు మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన యువనేత చాగంటి రాధాకృష్ణ
www.ntodaynews.com

గ్రామాల్లో పులి సంచారంపై ప్రత్యేక చర్యలు

తెలంగాణ
03 Feb, 2026 - 04:15 AM
92 వీక్షణలు
గ్రామాల్లో పులి సంచారం: జిల్లా కలెక్టర్ ప్రత్యేక చర్యలు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లాలోని కొన్ని గ్రామాల పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. మంగళవారం రాజాపేట మండలం బసంతాపూర్ గ్రామంలో పులి దాడిలో లేగ దూడ మృతి చెందిన సంఘటన స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులతో సమావేశమై పులిని పట్టుకునేందుకు చేపడుతున్న చర్యలపై సమీక్షించారు. పులి పట్టుకునేందుకు చర్యలు పులి సంచారాన్ని గుర్తించేందుకు థర్మల్ డ్రోన్ ద్వారా వీడియో రికార్డింగ్, ట్రాప్ కెమెరాల ఏర్పాటు, పులిని బంధించేందుకు బోన్లను అమర్చినట్లు అటవీ శాఖ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. పులి అడుగుజాడలను నిరంతరం గమనిస్తూ దానిని అడవిలోకి మళ్లించే దిశగా చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. ప్రజలకు సూచనలు అడవి ప్రాంతాలకు ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లకూడదని, వ్యవసాయ పనుల కోసం వెళ్లేటప్పుడు గుంపులుగా వెళ్లాలని కలెక్టర్ సూచించారు. రాత్రివేళ పశువులను బయట వదలకుండా పశువుల పాకల్లో సరిపడా వెలుతురు ఉండేలా చూసుకోవాలని తెలిపారు. పులి కనిపించినట్లు గమనించిన వెంటనే అటవీ శాఖ అధికారులు లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని, దానికి సమీపానికి వెళ్లే ప్రయత్నం చేయరాదని హెచ్చరించారు. ప్రజలు భయాందోళనకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫారెస్ట్ అధికారి, రెవెన్యూ అధికారులు మరియు సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube