చిట్యాలలో రోడ్డు ప్రమాదం : యువకుడికి గాయాలు
చిట్యాలలో రోడ్డు ప్రమాదం : యువకుడికి గాయాలు
నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని భువనగిరి రోడ్డులో ఉన్న భారత్ పెట్రోల్ పంప్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రామన్నపేట మండలం ఉత్తటూరు గ్రామానికి చెందిన నితిన్ అనే యువకుడు రామన్నపేట నుండి చిట్యాల వైపు తన ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. భువనగిరి రోడ్డులో ఎదురుగా వస్తున్న మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ కలిగిన ఒక డీసీఎం వాహనం నితిన్ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు నితిన్ గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నితిన్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. పోలీసులు, ప్రమాదం ఎలా జరిగింది అనే కోణంలో పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.