BREAKING
జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత.. జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత..
www.ntodaynews.com

చిట్యాల సుజన థియేటర్‌లో ఉద్రిక్తత

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
19 Mar, 2026 - 10:56 PM
826 వీక్షణలు

 'ఉస్తాద్ భగత్ సింగ్' షో రద్దు
*టికెట్ ధరలు వాపస్
నల్గొండ జిల్లా ​చిట్యాల  పట్టణంలోని సుజన సినిమా థియేటర్ వద్ద గురువారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' ఫస్ట్ షో ప్రదర్శన సందర్భంగా సాంకేతిక లోపాలు తలెత్తడంతో ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ​
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ షోను వీక్షించేందుకు అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్‌కు చేరుకున్నారు. అయితే, సినిమా ప్రారంభమైనప్పటి నుంచి సౌండ్ సిస్టంలో తీవ్ర అంతరాయం ఏర్పడింది.
డైలాగులు వినిపించకపోవడం, సౌండ్ సరిగా లేకపోవడంతో విసుగు చెందిన ప్రేక్షకులు షో మధ్యలోనే బయటకు వచ్చి ఆందోళనకు దిగారు.
థియేటర్ లోపల సౌకర్యాలు లేవని, నాణ్యమైన సౌండ్ సిస్టం లేకుండా షో ఎలా వేస్తారని యాజమాన్యాన్ని నిలదీశారు. దీంతో యాజమాన్యానికి, ప్రేక్షకులకు మధ్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది.
పరిస్థితి అదుపు తప్పుతుండటంతో థియేటర్ యాజమాన్యం వెనక్కి తగ్గింది. ఫస్ట్ షో చూస్తున్న ప్రేక్షకులకు టికెట్ డబ్బులను వెనక్కి ఇచ్చేసి సర్దిచెప్పింది. నిరాశతో
వెనుదిరిగిన ఫ్యాన్స్
​ఫస్ట్ షో గందరగోళం కారణంగా సాంకేతిక సమస్య సద్దుమణగకపోవడంతో, యాజమాన్యం సెకండ్ షోను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అప్పటికే సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు పరిస్థితిని తెలుసుకుని తీవ్ర నిరాశతో వెనుతిరిగారు.