వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ
ఎంజీఎం ఆస్పత్రిలో కుక్కల సంచారం
భయాందోళనలో రోగులు, బంధువులు.. చర్యలు తీసుకోవాలని డిమాండ్
వరంగల్ | Ntoday News
వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రి ప్రాంగణంలో వీధి కుక్కలు సంచరిస్తుండటంపై రోగులు, వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి పరిసరాల్లో కుక్కలు స్వేచ్ఛగా తిరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చే రోగులు, వారితో ఉండే కుటుంబ సభ్యులు కుక్కల సంచారంతో భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, రోగులకు కుక్కల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆస్పత్రి ప్రాంగణంలో కుక్కల సంచారాన్ని నియంత్రించడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని రోగుల బంధువులు కోరుతున్నారు. ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.