పి ఆర్ సి ని ప్రకటించాలని ఎమ్మార్వో కు వినతి
పి ఆర్ సి ని ప్రకటించాలని ఎమ్మార్వో కు వినతి
పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, పెండింగ్ డీఏలను విడుదల చేయడంతో పాటు ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీఎస్యూటీఎఫ్ చిట్యాల మండల శాఖ ఆధ్వర్యంలో 29 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మండల తహసీల్దార్కు అందజేశారు. యూఎస్పీసీ నాలుగు దశల పోరాట కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్యూటీఎఫ్ మండల అధ్యక్షులు ఏషమళ్ల నాగయ్య మాట్లాడుతూ రెండేళ్లుగా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కాకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పీఆర్సీ ప్రకటించాలని, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో తీవ్రస్థాయిలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. మండల కోశాధికారి తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని, పీఆర్సీని వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సతీష్ గడగోజు, జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యులు బడుగు అరుణ, మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు నర్ర సరళ, ఉపాధ్యక్షులు ఎం. జానకి, రామలింగయ్య, చంద్రశేఖర్, సాధిక్, రామ్మోహన్, మాజీ అధ్యక్షులు యాదయ్య తదితరులు పాల్గొన్నారు.