BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

పి ఆర్ సి ని ప్రకటించాలని ఎమ్మార్వో కు వినతి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
13 Aug, 2026 - 05:47 PM
44 వీక్షణలు

పి ఆర్ సి ని ప్రకటించాలని ఎమ్మార్వో కు వినతి

పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలని, పెండింగ్ డీఏలను విడుదల చేయడంతో పాటు ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీఎస్‌యూటీఎఫ్ చిట్యాల మండల శాఖ ఆధ్వర్యంలో 29 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మండల తహసీల్దార్‌కు అందజేశారు. యూఎస్‌పీసీ నాలుగు దశల పోరాట కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్‌యూటీఎఫ్ మండల అధ్యక్షులు ఏషమళ్ల నాగయ్య మాట్లాడుతూ రెండేళ్లుగా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కాకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పీఆర్‌సీ ప్రకటించాలని, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో తీవ్రస్థాయిలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. మండల కోశాధికారి తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని, పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సతీష్ గడగోజు, జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యులు బడుగు అరుణ, మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు నర్ర సరళ, ఉపాధ్యక్షులు ఎం. జానకి, రామలింగయ్య, చంద్రశేఖర్, సాధిక్, రామ్మోహన్, మాజీ అధ్యక్షులు యాదయ్య తదితరులు పాల్గొన్నారు.