BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

పెయింట్ మై టౌన్ చింతలపూడి పట్టణ సుందరీకరణకు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ శ్రీకారం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Aug, 2026 - 08:21 PM
25 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

చింతలపూడి పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కొత్తగా నిర్మించిన ఆర్ఎంబీ రోడ్డు మధ్యభాగంలోని సెంటర్ డివైడర్‌కు రంగులు వేసే కార్యక్రమానికి గురువారం రాత్రి 9 గంటలకు చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ శ్రీకారం చుట్టనున్నారు.

ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు అందుబాటులో లేకపోయినప్పటికీ పట్టణ సుందరీకరణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్, దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని స్వయంగా చేపట్టారు. పట్టణ ప్రధాన రహదారులకు కొత్త అందాన్ని తీసుకురావడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలనే ఉద్దేశంతో సెంటర్ డివైడర్‌కు ఆకర్షణీయమైన రంగులు వేయనున్నారు.

పట్టణ అభివృద్ధి కేవలం ప్రభుత్వ నిధులతోనే కాకుండా ప్రజలు, దాతలు, నాయకులు, కార్యకర్తల సహకారంతోనూ సాధ్యమనే సందేశాన్ని ఈ కార్యక్రమం చాటనుంది. చింతలపూడి పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పిలుపునిచ్చింది.

ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, పట్టణ సుందరీకరణపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కోరింది.