డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలి
దోసకాయలపల్లి, కోరుకొండ మండలం:
దోసకాయలపల్లి GSH జూనియర్ కాలేజీలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, వాటికి దూరంగా ఉండాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా నార్త్ జోన్ ఈగల్ టీమ్కు చెందిన ఎస్ఐ నారాయణ స్వామి గారు మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత డ్రగ్స్కు ఆకర్షితులు కాకుండా తమ భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని సూచించారు. డ్రగ్స్ వినియోగం ఆరోగ్యంతో పాటు కుటుంబం, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు.
“డ్రగ్స్ వద్దు బ్రో.. మంచి భవిష్యత్తు కోసం డ్రగ్స్కు దూరంగా ఉండాలి” అనే సందేశాన్ని విద్యార్థులకు అందించారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.