భూమిలో కంచె తొలగించారు.. న్యాయం చేయాలని డిమాండ్
భూమిలో కంచె తొలగించారు.. న్యాయం చేయాలని డిమాండ్
తమ భూమిలోకి కొందరు అక్రమంగా ప్రవేశించి కంచెను తొలగించారని, ఈ విషయంపై గత నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని జోగు ప్రవీణ్ ఆరోపించారు. ఈ మేరకు మీడియా మిత్రులకు విడుదల చేసిన ప్రకటనలో వారు వివరాలు వెల్లడించారు. తమ తాతకు సంబంధించిన భూమికి అన్ని హక్కు పత్రాలు తమ వద్ద ఉన్నాయని, భూమిని సాగు చేసుకుంటున్న సమయంలో గత నెల రాత్రి కొందరు వచ్చి భూమి చుట్టూ ఏర్పాటు చేసిన కంచెను తొలగించారని తెలిపారు. దీనిపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు ఎమ్మార్వో, ఆర్డీఓ అధికారులను కూడా ఫిర్యాదు చేశామన్నారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని ప్రజా పోరాట సమితి నాయకుడు నూనె వెంకటస్వామిని సంప్రదించగా, తమకు మద్దతుగా వచ్చిన ఆయనపై కొందరు దుర్భాషలాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే వెంకటస్వామిపై చేసిన వ్యాఖ్యలను కూడా ఖండిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. భూ వివాదంపై అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.