BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

భూమిలో కంచె తొలగించారు.. న్యాయం చేయాలని డిమాండ్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
13 Aug, 2026 - 08:37 PM
74 వీక్షణలు

భూమిలో కంచె తొలగించారు.. న్యాయం చేయాలని డిమాండ్

తమ భూమిలోకి కొందరు అక్రమంగా ప్రవేశించి కంచెను తొలగించారని, ఈ విషయంపై గత నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని జోగు ప్రవీణ్  ఆరోపించారు. ఈ మేరకు మీడియా మిత్రులకు విడుదల చేసిన ప్రకటనలో వారు వివరాలు వెల్లడించారు. తమ తాతకు సంబంధించిన భూమికి అన్ని హక్కు పత్రాలు తమ వద్ద ఉన్నాయని, భూమిని సాగు చేసుకుంటున్న సమయంలో  గత నెల రాత్రి కొందరు వచ్చి భూమి చుట్టూ ఏర్పాటు చేసిన కంచెను తొలగించారని తెలిపారు. దీనిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు ఎమ్మార్వో, ఆర్డీఓ అధికారులను కూడా ఫిర్యాదు చేశామన్నారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని ప్రజా పోరాట సమితి నాయకుడు నూనె వెంకటస్వామిని సంప్రదించగా, తమకు మద్దతుగా వచ్చిన ఆయనపై కొందరు దుర్భాషలాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే వెంకటస్వామిపై చేసిన వ్యాఖ్యలను కూడా ఖండిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. భూ వివాదంపై అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.