BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

దేశభక్తికి ప్రతీక ప్రతిజ్ఞ టి.ఉమామహేశ్వర రావు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Aug, 2026 - 08:21 PM
35 వీక్షణలు

ఏ.కొండూరు, ఆగస్టు 13: విద్యార్థుల్లో దేశభక్తి, సోదరభావాన్ని పెంపొందించేందుకు పైడిమర్రి వెంకట సుబ్బారావు రచించిన ‘భారతదేశం–నా మాతృభూమి’ ప్రతిజ్ఞ ఎంతో దోహదపడుతుందని తెలుగు భాషా వికాస సమితి అధ్యక్షులు టీ. ఉమామహేశ్వరరావు తెలిపారు.

గురువారం పైడిమర్రి వెంకట సుబ్బారావు వర్ధంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ.కొండూరు మండలం కోడూరు గ్రామంలోని మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యం. రాంప్రదీప్ రచించిన పైడిమర్రి జీవిత చరిత్ర పుస్తకాన్ని ఉమామహేశ్వరరావు పరిచయం చేసి మాట్లాడారు.

దేశభక్తికి ప్రతీకగా నిలిచిన ప్రతిజ్ఞను ప్రతి విద్యార్థి అర్థం చేసుకొని ఆచరించాలని సూచించారు. దేశం పట్ల బాధ్యత, ఐక్యత, సోదరభావం పెంపొందించడంలో ప్రతిజ్ఞ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది బి. నాగేంద్రరావు, టీ. సుప్రియ తదితరులు పాల్గొన్నారు.