www.ntodaynews.com
గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి
ఆంధ్రప్రదేశ్
/
విజయనగరం
గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి
విజయనగరం: జిల్లాలో గంజాయి వినియోగం, అక్రమ విక్రయాలు, రవాణాకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు అందించాలని విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, IPS ప్రజలకు సూచించారు. గంజాయికి సంబంధించిన నమ్మకమైన సమాచారాన్ని పోలీసులకు అందించే వారికి రూ.5,000 నగదు బహుమతి అందజేస్తామని తెలిపారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు పేర్కొన్నారు.
సమాచారం ఉంటే పోలీసులకు లేదా అత్యవసర పరిస్థితుల్లో 100/112కు సమాచారం అందించాలని సూచించారు.