BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

ఇంటి తాళం పగులగొట్టి నగదు, బంగారం, వెండి చోరీ

తెలంగాణ
/ నల్గొండ / నార్కెట్ పల్లి
13 Aug, 2026 - 08:37 PM
25 వీక్షణలు

ఇంటి తాళం పగులగొట్టి నగదు, బంగారం, వెండి చోరీ

నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం జువ్విగూడెం గ్రామంలో ఓ ఇంటి తాళం పగులగొట్టి నగదు, బంగారం, వెండి వస్తువులను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. గ్రామానికి చెందిన వంగాల యాదగిరిరెడ్డి (70) గురువారం నార్కట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యాదగిరిరెడ్డి గురువారం ఉదయం సుమారు 4.20 గంటలకు రోజువారీగా పాలు పిండుకోవడానికి ఇంటి సమీపంలోని బావి వద్దకు వెళ్లారు. తిరిగి ఉదయం 5 గంటలకు ఇంటికి చేరుకోగా తలుపు తాళం పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. ఇంట్లోని లాకర్‌ను పరిశీలించగా రూ.42 వేల నగదు, సుమారు ఆరు తులాల వెండి పట్టీలు, సుమారు ఒక తులం బరువున్న రెండు బంగారు ఉంగరాలు కనిపించలేదు. గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి నగదు, బంగారం, వెండి వస్తువులను అపహరించినట్లు బాధితుడు పోలీసులకు తెలిపారు. ఫిర్యాదు మేరకు నార్కట్పల్లి ఎస్సై పి.విష్ణుమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆధారాలను సేకరిస్తూ నిందితుల ఆచూకీ కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.