DSC 2025, నిరుద్యోగ సమస్యలపై ఆత్మకూరులో ర్యాలీ, రాస్తారోకో
శిల్పా చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ ఆందోళన
ఆత్మకూరు: NTODAY NEWS
నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ శిల్పా చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు DSC–2025, నిరుద్యోగం తదితర సమస్యలపై ఆత్మకూరు పట్టణంలో ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు.
ఆత్మకూరు పట్టణంలోని వైఎస్సార్ కూడలి వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. DSC–2025 విషయంలో నిరుద్యోగులకు న్యాయం చేయాలని, యువత సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ శిల్ప భువనేశ్వర్ రెడ్డి, వెలుగోడు ఎంపీపీ శ్రీ లాలం రమేష్ గుప్తా, మోత్కూరు మాజీ ఎంపీటీసీ ఎం. రామ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అలాగే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీ, రాస్తారోకోను విజయవంతం చేశారు. నిరుద్యోగ యువత, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందని నాయకులు తెలిపారు.