BREAKING
డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి హైదరాబాద్ భిన్న సంస్కృతుల సమ్మేళనం ఈఎస్ఐ మల్టీ స్పెషాలిటీ వంద పడకల ఆసుపత్రి మంజూరు కై ఏఐటియుసి పోరు ఆగస్టు 13న తాడేపల్లిలో ట్రాఫిక్ ఆంక్షలు.. DSC 2025, నిరుద్యోగ సమస్యలపై ఆత్మకూరులో ర్యాలీ, రాస్తారోకో విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి కడెం ఆయకట్టు నీటి విడుదలపై BRS, BJP అసత్య ప్రచారం డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి హైదరాబాద్ భిన్న సంస్కృతుల సమ్మేళనం ఈఎస్ఐ మల్టీ స్పెషాలిటీ వంద పడకల ఆసుపత్రి మంజూరు కై ఏఐటియుసి పోరు ఆగస్టు 13న తాడేపల్లిలో ట్రాఫిక్ ఆంక్షలు.. DSC 2025, నిరుద్యోగ సమస్యలపై ఆత్మకూరులో ర్యాలీ, రాస్తారోకో విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి కడెం ఆయకట్టు నీటి విడుదలపై BRS, BJP అసత్య ప్రచారం
www.ntodaynews.com

తెలంగాణలో ఈనెల 17 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో తనిఖీలు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Aug, 2026 - 09:12 PM
29 వీక్షణలు

తెలంగాణలో ఈనెల 17 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో తనిఖీలు

విద్యా ప్రమాణాలు, వసతులపై ప్రత్యేక దృష్టి.. 307 అకడమిక్‌ బృందాల ఏర్పాటు

హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులపై తెలంగాణ విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈ నెల 17వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించనుంది. ఇందుకోసం 307 అకడమిక్‌ ప్యానెల్‌ బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు.

ఈ తనిఖీల్లో పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న బోధనా విధానం, ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల హాజరు శాతం, పాఠశాల పరిసరాల పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోందా? బోధనా కార్యక్రమాలు నిర్దేశిత ప్రణాళిక ప్రకారం కొనసాగుతున్నాయా? అనే అంశాలపై కూడా బృందాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నాయి.

తనిఖీల సందర్భంగా గుర్తించిన లోపాలు, పాఠశాలల పరిస్థితి, విద్యార్థుల అవసరాలు తదితర అంశాలతో సమగ్ర నివేదికలను సంబంధిత అధికారులకు సమర్పించనున్నారు. ఈ నివేదికల ఆధారంగా పాఠశాలల్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, వసతుల మెరుగుదలకు ఈ తనిఖీలు దోహదపడతాయని విద్యాశాఖ భావిస్తోంది.