BREAKING
డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి హైదరాబాద్ భిన్న సంస్కృతుల సమ్మేళనం ఈఎస్ఐ మల్టీ స్పెషాలిటీ వంద పడకల ఆసుపత్రి మంజూరు కై ఏఐటియుసి పోరు ఆగస్టు 13న తాడేపల్లిలో ట్రాఫిక్ ఆంక్షలు.. DSC 2025, నిరుద్యోగ సమస్యలపై ఆత్మకూరులో ర్యాలీ, రాస్తారోకో విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి కడెం ఆయకట్టు నీటి విడుదలపై BRS, BJP అసత్య ప్రచారం డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి హైదరాబాద్ భిన్న సంస్కృతుల సమ్మేళనం ఈఎస్ఐ మల్టీ స్పెషాలిటీ వంద పడకల ఆసుపత్రి మంజూరు కై ఏఐటియుసి పోరు ఆగస్టు 13న తాడేపల్లిలో ట్రాఫిక్ ఆంక్షలు.. DSC 2025, నిరుద్యోగ సమస్యలపై ఆత్మకూరులో ర్యాలీ, రాస్తారోకో విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి కడెం ఆయకట్టు నీటి విడుదలపై BRS, BJP అసత్య ప్రచారం
www.ntodaynews.com

నల్ల బెల్లం కేసులో పరారీలో ఉన్న ఏ2 నిందితుడు అరెస్ట్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Aug, 2026 - 05:28 PM
26 వీక్షణలు

చింతలపూడి: నాటుసారా తయారీదారులకు నల్ల బెల్లం సరఫరా చేసిన కేసులో గత కొంతకాలంగా పరారీలో ఉన్న ఏ2 నిందితుడిని నూజివీడు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారులు అరెస్ట్ చేశారు. చింతలపూడి మండలం, చింతలపూడి గ్రామానికి చెందిన వజ్రపు సీతా మహేశ్వరరావు ఈ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్నాడు. 2026 ఏప్రిల్‌ 4న నమోదైన నేర సంఖ్య 19/2026 కేసులో అప్పటి నుంచి పరారీలో ఉన్న అతడిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం తిరువూరు న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ. మస్తానయ్య తెలిపారు. అక్రమంగా నల్ల బెల్లం నిల్వ చేయడం, రవాణా చేయడం, విక్రయించడం, నాటుసారా తయారీదారులకు సరఫరా చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.