నల్ల బెల్లం కేసులో పరారీలో ఉన్న ఏ2 నిందితుడు అరెస్ట్
చింతలపూడి: నాటుసారా తయారీదారులకు నల్ల బెల్లం సరఫరా చేసిన కేసులో గత కొంతకాలంగా పరారీలో ఉన్న ఏ2 నిందితుడిని నూజివీడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. చింతలపూడి మండలం, చింతలపూడి గ్రామానికి చెందిన వజ్రపు సీతా మహేశ్వరరావు ఈ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్నాడు. 2026 ఏప్రిల్ 4న నమోదైన నేర సంఖ్య 19/2026 కేసులో అప్పటి నుంచి పరారీలో ఉన్న అతడిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం తిరువూరు న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎ. మస్తానయ్య తెలిపారు. అక్రమంగా నల్ల బెల్లం నిల్వ చేయడం, రవాణా చేయడం, విక్రయించడం, నాటుసారా తయారీదారులకు సరఫరా చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.