పెనుగొలను శాఖా గ్రంథాలయంలొ స్వాతంత్ర్య సమరయోధి తాంతియా తోపే వర్ధంతి
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను శాఖా గ్రంథాలయంలొ స్వాతంత్ర్య సమరయోధి తాంతియా తోపే వర్ధంతి ఘనంగా
శనివారం, పెనుగొలను శాఖా గ్రంథాలయంలో ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధి తాంతియా తోపే (రామచంద్ర పాండురంగ్) వర్ధంతి ఘనంగా నిర్వహించబడింది. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, జాతీయ గర్వం పెంచే విధంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడమైపోయింది. 1857 ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటిష్ పై బలమైన పోరాటం చేసె గొప్ప గెరిల్లా యోధుడైన తాంతియా తోపే, ఝాన్సీ లక్ష్మీబాయి పక్షాన పోరాడి బ్రిటిష్ సైన్యానికి ముచ్చెమటలు పట్టించారు.
వక్తలు ఈ సందర్భంలో ఆయన మహోన్నత పోరాటాన్ని, ఆత్మనివేదనను గుర్తుచేసుకుంటూ, "తాంతియా తోపే దేశస్వాతంత్ర్యానికి ప్రాణాలెందించిన యోధుడు" అని కొనియాడారు. ఆయన చివరికి ఉరి కంభాన్ని ముద్దాడి, స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రాణాలను సమర్పించారు. ఆయన జీవితమంతా స్ఫూర్తిగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ నిర్వాహకులు తెనాలి వెంకటేశ్వర్లు, సాయిబాబా కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.