BREAKING
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు!
Date of Publish : 17 July 2026, 06:22 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి మంచోడు మణిపై దాడి..

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jul, 2026 - 06:22 PM
100 వీక్షణలు

ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి మంచోడు మణిపై దాడి.. ఆస్పత్రిలో పరామర్శించిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు

నూజివీడు నియోజకవర్గం నూజివీడు మండలం బోర్వంచ గ్రామానికి చెందిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ కార్యదర్శి బేతమాల మణిరత్నం (మంచోడు మణి)పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, నిన్న రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో సెయింట్ పౌల్స్ సెమినరీ సమీపంలో కాపుకాచి ఉన్న దుండగులు ముందుగా కారుతో ఢీకొట్టి కిందపడేసి, అనంతరం కాళ్లపై కారును ఎక్కించి రాడ్లు, కత్తులతో దాడి చేసినట్లు తెలిపారు.

తీవ్రంగా గాయపడిన మంచోడు మణిని చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటన విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు శుక్రవారం ఉదయం ఆస్పత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

దాడి ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు అధికారులను కోరారు.