సెల్ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్
కలబురిగి | కర్ణాటక | NTODAY NEWS
కర్ణాటకలో రాత్రి వేళ సెల్ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సును నడిపిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కలబురిగి–చించోలి మార్గంలో నడుస్తున్న బస్సులో హెడ్లైట్లు పనిచేయకపోవడంతో, కండక్టర్ తన సెల్ఫోన్ టార్చ్ లైట్ను ఆన్ చేసి పట్టుకోగా డ్రైవర్ బస్సును నడిపినట్లు వీడియోలో కనిపిస్తోంది.
ఈ వీడియో వైరల్ కావడంతో ప్రయాణికుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. హెడ్లైట్లు పనిచేయని బస్సును రాత్రివేళ రోడ్డుపై నడపడం ఎంతవరకు సమంజసమని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
అలాంటి పరిస్థితుల్లో ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారా అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనపై సంబంధిత రవాణా అధికారులు స్పందించి విచారణ చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.