BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్

జాతీయం అంతర్జాతీయం
05 Jul, 2026 - 09:32 PM
81 వీక్షణలు

కలబురిగి | కర్ణాటక | NTODAY NEWS

కర్ణాటకలో రాత్రి వేళ సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సును నడిపిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కలబురిగి–చించోలి మార్గంలో నడుస్తున్న బస్సులో హెడ్‌లైట్లు పనిచేయకపోవడంతో, కండక్టర్ తన సెల్‌ఫోన్ టార్చ్ లైట్‌ను ఆన్ చేసి పట్టుకోగా డ్రైవర్ బస్సును నడిపినట్లు వీడియోలో కనిపిస్తోంది.

ఈ వీడియో వైరల్ కావడంతో ప్రయాణికుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. హెడ్‌లైట్లు పనిచేయని బస్సును రాత్రివేళ రోడ్డుపై నడపడం ఎంతవరకు సమంజసమని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

అలాంటి పరిస్థితుల్లో ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారా అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనపై సంబంధిత రవాణా అధికారులు స్పందించి విచారణ చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.