దేశంలోనే తొలి ట్రాన్స్జెండర్ క్లినిక్ హైదరాబాద్లో ప్రారంభం
హైదరాబాద్ | NTODAY NEWS
ట్రాన్స్జెండర్ సమాజానికి ప్రత్యేక వైద్య సేవలు అందించేందుకు దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్లోని సనత్నగర్ ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ప్రత్యేక ట్రాన్స్జెండర్ క్లినిక్ ప్రారంభమైంది.
ఈఎస్ఐసీ ఆసుపత్రి మరియు 'క్వీర్ బంధు పేరెంట్స్ అసోసియేషన్' సంయుక్తంగా ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాయి. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి అవసరమైన సమగ్ర వైద్య సేవలను ఒకే చోట అందుబాటులోకి తీసుకురావడమే ఈ క్లినిక్ ప్రధాన లక్ష్యం.
ఈ క్లినిక్లో జనరల్ హెల్త్ చెకప్లు, మానసిక ఆరోగ్య కౌన్సెలింగ్, హార్మోన్ థెరపీ, ప్రత్యేక వైద్య సేవలు అందించనున్నారు. వివక్షకు తావు లేకుండా, సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణంలో వైద్య సేవలు అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ట్రాన్స్జెండర్ వ్యక్తులకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందుబాటులోకి తీసుకురావడంలో ఈ క్లినిక్ కీలక మైలురాయిగా నిలుస్తుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.