www.ntodaynews.com
పాల్వంచలో భారీగా గంజాయి స్వాధీనం
తెలంగాణ
పాల్వంచ పట్టణ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. ఆటోలో అక్రమంగా తరలిస్తున్న రూ.14.45 లక్షల విలువైన 28.9 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనలో ఉప్పుగుండ్ల ప్రభాకర్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి రూ.34 వేల నగదు, ఒక సెల్ఫోన్తో పాటు గంజాయి తరలింపునకు ఉపయోగించిన ఆటోను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.